కాంగ్రెస్ కార్యకర్తలకి పిలుపునిచ్చిన రాహుల్

SMTV Desk 2019-05-03 18:08:00  rahul, foni tupan,

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ కార్యకర్తలను పిలుపునిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంలో కాంగ్రెస్ కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన ఒడిశా, ఏపి పశ్చమబెంగాల్‌లోని ఫణి తుపాను ముంచుకొస్తున్నందున సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తం చేయాలి.

వారికి ఎలాంటి ఆపద రాకుండా సహాయక చర్యలు చేపట్టాలి. ఈ పెను విపత్తు త్వరగా తీరం దాటిపోవాలనీ, ప్రజలంతా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు అండగా ఉండాలని సూచించారు