న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్లో మొదట చెన్నై ప్లేఆఫ్ లో ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత ఢిల్లీ ఊహించని విధంగా ప్లేఆఫ్ లో చోటు దక్కించుకుంది. అయితే గురువారం రాత్రి ముంభై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో ముంభై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ కు మూడు జట్టులు చేరుకున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్కు ఇంకా ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. శనివారం బెంగుళూరు జట్టుతో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ నెగ్గితే ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు మెండిగా ఉన్నాయి.