ప్రతి ఒక్కరిని కాపాడుతాం .. నవీన్ పట్నాయక్

SMTV Desk 2019-05-02 19:23:10  Naveen Patnayak,

ఫొని తుపానుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఆయన, ప్రతి ఒక్కరిని కాపాడుతామని అన్నారు. దాదాపు 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమ గవర్నమెంట్ చర్యలు చేపడుతుందని సీఎం తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు పూరీ బీచ్‌ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దని ఆంక్షలు విధించారు.