ఈ సారి తెలుగు రాష్ట్రాలను చేసారు

SMTV Desk 2019-05-02 12:38:32  telugu states, hackers, government websites

హైదరాబాద్, మే 02: ఈ సారి తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసిన హ్యాకర్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్కంల వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. ర్యాన్సమ్ వేర్ వైరస్‌తో హ్యాకర్లు రెచ్చిపోయారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీఈపీడీఎస్‌ఎల్ వైబ్‌సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి.

డేటా హ్యాక్ చేసి, డిలీట్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు.. రూ. 35 కోట్లు డిమాండ్ చేశారు. డేటా బ్యాకప్ ఉండడంతో ముప్పు తప్పింది. డిస్కంల హ్యాకింగ్‌పై సీసీఎస్ పోలీసులకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.