ఏపీ లో రీపోలింగ్‌ అప్పుడే

SMTV Desk 2019-05-02 12:25:07  Elections, Ap.

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు, ఈవీఎం మొరాయింపు వంటి పొరపాట్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో నెల్లూరులోని 2 కేంద్రాలు, గుంటూరులోని 2 కేంద్రాలు, ప్రకాశం జిల్లాలో ఒక కేంద్రం ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రాజకీయ పార్టీల తరపున పిర్యాధులు అందాయి. దీంతో ఆయన ఆ 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు.

గోపాలకృష్ణ ద్వివేది ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహణకు అంగీకరించింది. ఈ మే నెల 6వ తేదీన రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. రీపోలింగ్ జరపాల్సిన బూత్‌లకు సంబంధించిన వివరాలు కూడా పంపబడ్డాయి. ఈ రీపోలింగ్ కోసం ఉపయోగించబోయే ఈవీఎం, వీవీప్యాట్ మిషన్లను కూడా లెక్కించి 23న ఫలితాలను వెల్లడించనున్నారు.