సెల్ఫీ పిచ్చి : ముగ్గురు మృతి

SMTV Desk 2019-05-01 16:41:50  Selfie, Train, three killed

హర్యానా : సెల్ఫీ మోజు ఓ ముగ్గరు యువకుల ప్రాణం తీసింది. రైలు పట్టాలపై సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు రైలు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ఘటన పానిపట్‌లో బుధవారం ఉదయం జరిగింది. పెళ్లి వేడుకల కోసం పానిపట్ కు వచ్చిన ఓ నలుగురు యువకులు స్థానికంగా ఉన్న రైలు పట్టాలపై సెల్ఫీ దిగుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.