నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోబాల వరద కొనసాగింది. 72 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తనిఖీల్లో రూ.785కోట్ల నగదు పట్టుబడింది. రూ. 249 కోట్ల విలువైన మద్యం, రూ. 1214 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఇక రూ. 972 కోట్ల బంగారాన్ని సీజ్ చేసినట్టు తెలిపింది.