మరో చర్చిలో ఉగ్రదాడి...ఆరుగురు మృతి

SMTV Desk 2019-04-30 12:45:31  africa, srilanka, colombo, burkina fanola church terrorist attack

ఆఫ్రికా: శ్రీలంకలోని కొలంబోలో ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మొత్తం 360 మంది మృతి చెందగా మరో 550 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోరం జరిగిన రోజుల వ్యవధిలోనే ఉగ్రమూకలు మళ్ళీ రెచ్చిపోయాయి. ఆఫ్రికా ఖండ దేశమైన బుర్కినా ఫాసోలో చర్చిపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులలో ఒక పాస్టర్, అతని ఇద్దరు తనయులు కూడా ఉన్నారు. మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో చర్చిలో ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా…ఏడు మోటార్ బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఎంతమంది దాడికి పాల్పడ్డారు అనే విషయంలో స్పష్టత రాలేదు. మరోవైపు, ఈ దాడి తామే పాల్పడినట్టు ఇంత వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. 2016లో పశ్చిమ ఆఫ్రికాలో జిహాదిస్ట్ హింస చోటు చేసుకున్న తర్వాత చర్చిపై జరిగిన తొలి ఉగ్రదాడి ఇదే.