ఫణి తుపాన్ తో అధికారులను అప్రమత్తం చేశారు ప్రధాని మోడీ. ఉన్నతాధికారులతో సైక్లోన్ పై మాట్లాడిన ఆయన.. ఎటువంటి పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారిన నేపథ్యంలో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇక ప్రతీ ఒక్కరి భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు.