సంతానం కలగలేదని...!!

SMTV Desk 2019-04-29 11:28:44  couple suicide

కర్నూల్: బనగానపల్లిలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడంలేదని బాధతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల ప్రకారం...బనగానపల్లి మండలం సాధు కుట్టం గ్రామానికి చెందిన మృత్యుంజయ ఆచారి(40), భార్య సరస్వతి(35) ఇంట్లో రెండు రోజుల కిందట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం వీరి ఇంటి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు ఇంటి తలుపులు తెరిచి చూడగా వారు ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అయింది. గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో మృత్యుంజయ ఆచారి పూజారిగా పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం కోసం మృత్యుంజయ ఆచారి, సరస్వతి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.