కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-04-28 18:57:36  kadapa, accident,

కడప జిల్లాలోని మైదుకూరు మండలం ఎడ్డోడు కనుమ వద్ద ఆదివారం ఉదయం రొండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కలసపాడుకు చెందిన చిన్న(30) గా గుర్తించారు. మరొక వ్యక్తి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పొరుమావిళ్ళ మండలం పులివీడుకు చెందిన వీరయ్య (35) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.