సరికొత్త ప్లన్స్ తెస్తున్న ఎయిర్‌టెల్

SMTV Desk 2019-04-28 12:58:12  Airtel, Airtel offer

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. రూ.48, రూ.98 ల‌కు ఆ ప్లాన్లు కస్టమర్లకు అందుబాటులోకి వ‌చ్చాయి. రూ.48 ప్లాన్‌లో 3జిబి డేటా, రూ.98 ప్లాన్‌లో 6జిబి డేటా వస్తుంది. రూ.98 ప్లాన్‌లో 10 ఉచిత ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. నెల‌వారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ రెండు ప్యాక్‌లు స‌రిపోతాయ‌ని సంస్థ వెల్ల‌డించింది.

ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ గడువు 28 రోజులుగా నిర్ణ‌యించింది. అలాగే రూ.29కే మ‌రో ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోది. ఇందులో 520ఎంబి డేటా ఇస్తుంది. గడువు 28 రోజులు. ఇక రూ.92కే 6 జిబి డేటా వ‌చ్చే మ‌రో ప్లాన్ ఉంది కాక‌పోతే ఈ ప్లాన్ వాలిడిటీ కేవ‌లం 7 రోజులుగా ఎయిర్ టెల్ నిర్ణయించింది.