పెళ్లి బృందం బస్సును ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి

SMTV Desk 2019-04-27 19:15:45  assam, Raod accident

అసోం : ధుబ్రీ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందంతో వెళుతున్న బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.