ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో కంపెనీ తాజాగా ప్రత్యేకంగా అవెంజర్స్ అభిమానుల కోసం ఓ ఫోన్ను తీసుకువచ్చింది. ట్రెండ్ను క్యాచ్ చేసే దిశలో ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్క్లూజీవ్గా లభిస్తుంది. ఇండియాలో కూడా ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది కంపెనీ. ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ మొదటి సేల్ మే 1న అమెజాన్ ఇండియాలో నిర్వహిస్తారు. ఈ స్మార్ట్ఫోన్ కొన్నవారికి అవెంజర్స్ కలెక్టర్స్ బ్యాడ్జ్ కూడా గిఫ్టుగా ఇస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్: మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్,4000 ఎంఏహెచ్ బ్యాటరీ,ప్రో రియర్ కెమెరా 48+5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్,3.0 ఛార్జింగ్ సపోర్ట్, కలర్ ఓఎస్ 6.0,వంటి ప్రత్యేకతలున్న ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్స్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ 6 జీబీ+64జీబీ ధర రూ.27,990.