వైరల్ అవుతున్న ప్రభాస్ సాహి సెట్స్ ఫోటో

SMTV Desk 2019-04-27 12:33:20  Saaho,

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో . బాహుబలి తో వచ్చిన క్రేజ్‌ కారణంగా తాను నటించబోయే తర్వాతి సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని భావించిన ప్రభాస్, ముందుగా అనుకున్న సబ్జెక్ట్‌లో మార్పులు చేసి, సాహో ని పట్టాలెక్కించాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని స్టంట్‌ సీన్లు ఒకదానికి మించి ఒకటి అనేలా ఉండబోతున్నాయట. ఆల్రెడీ విడుదలైన రెండు టీజర్లు ఆ విషయాన్ని స్పష్టపరిచాయి. ఆగష్టులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. ఓ చిన్న యాక్షన్‌ సీన్‌ సహా పాటల చిత్రీకరణ మిగిలి ఉందట. పాటల కోసం సాహో టీమ్‌ ఆల్రెడీ లొకేషన్స్‌ వేట మొదలెట్టేశారు. హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్ధాకపూర్‌తో ప్రభాస్కి మూడు రొమాంటిక్‌ సాంగ్స్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ క్రమంలో షూట్ లో ఉన్న ప్రభాస్ ని బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ కలిశారు. తాజాగా హీరోయిన్ శ్రద్దా, దర్శకుడు సుజీత్ లతో ఆయన కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.