నేడు శ్రీవారి దర్శనం రద్దు

SMTV Desk 2019-04-27 12:22:29  ttd, tirumala tirupati devasthanam, lord venkateshwara

తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు దాదాపు 5 గంటల పాటు దర్శనం నిలిపివేయనున్నారు. తిరుమలలోని శ్రీవరాహస్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును 37 ఏళ్ల అనంతరం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం సందర్భంగా దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. శ్రీవరాహస్వామి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ క్రతువును కర్కాటక లగ్నంలో జరగనుంది. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలోనూ ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు ఉంటాయి.