లాభాలతో ఆరంభమైన మే సిరీస్

SMTV Desk 2019-04-26 18:33:55  Sensex, Nifty, Stock market, Share markets

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయి మే సిరీస్ తొలిరోజును ఘనంగా ముగించింది. సెన్సెక్స్ ఏకంగా 336 పాయింట్లు జంప్ చేసి 39,067 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 11,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 50లో టాటా స్టీల్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ ఏకంగా 7 శాతానికి పైగా పెరిగింది. బీపీసీఎల్ దాదాపు 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం లాభపడ్డాయి. అదేసమయంలో టాటా మోటార్స్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్, కోల్ ఇండియా, వేదాంత షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్ 3 శాతం క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు పడిపోయాయి. ఆటో షేర్లు ఎక్కువగా పడిపోయాయి. ఇక బ్యాంక్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు పెరిగాయి.