మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

SMTV Desk 2019-04-26 17:20:12  Fire accident,

మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాంటిన్‌ లో మంటలు అంటుకోవడంతో రైల్వే స్టేషన్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అక్కడి సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.