ఒకే స్టేజి పై ముగ్గురు స్టార్ హీరోస్

SMTV Desk 2019-04-26 12:07:31  mahesh babu, ram charan, NTR

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నెక్లెస్ రోడ్ లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో యూనిట్ తో పాటు ఓ స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నాడట. ఆ అతిథి ఎవరు అన్నది యూనిట్ సస్పెన్స్ లో పెట్టింది.

మహేష్ బాబుకు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. భరత్ అనే నేను వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎల్బీ స్టేడియంలో వేడుక జరిగింది. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే, మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ తో పాటు ఎన్టీఆర్‌ను కూడా ఈ వేడుకకు పిలుస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే.. ఇండస్ట్రీలో టాప్ హీరోలు ముగ్గురిని ఒకే వేదికపై చూడొచ్చు.