స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాలేదని...

SMTV Desk 2017-08-21 10:21:21  INDIPENDENCE DAY, STUDENTS, 2500 RUPEES FINE

చెన్నై, ఆగస్ట్ 21 : ఆగస్ట్ 15, స్వాతంత్ర్య దినోత్సవ౦ రోజున పాఠశాలకు హాజరు కాలేదని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు భారీగా జరిమానా విధించింది. ఈ సంఘటన చెన్నై పురసైవాక్కంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కొందరు విద్యార్థులు రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 19 మ౦ది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా ఫైన్ చెల్లించేంతవరకు పాఠశాలకు రావద్దంటూ హూకుం జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.