పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2019-04-25 11:28:29  Petrol, Deseal, Price, New delhi

న్యూఢిల్లీ: గురువారం దేశీయ ఇంధన ధరలు పైకి పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 8 పైసలు పెరిగింది. ఇదిలాఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.02 వద్ద, డీజిల్ ధర రూ.66.54 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.59 వద్ద, డీజిల్ ధర రూ.69.65 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.18 శాతం తగ్గుదలతో 73.71 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.27 శాతం క్షీణతతో 65.71 డాలర్లకు తగ్గింది.