కొలొంబో: శ్రీలంకలో మరో బాంబు దాడి జరిగింది. ఇప్పటికే ఆదివారం జరిగిన దాడుల్లో 359 మంది పౌరులు మృతిచెందగా, దాదాపు 600 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ అమానుష దాడిని మరువకముందే.. ముష్కరులు మరోసారి శ్రీలంక దేశాన్ని టార్గెట్ చేశారు. తాజాగా ఈరోజు మరో బాంబు దాడికి తెగబడ్డారు. ఈస్టర్ దాడి తరువాత మరిన్ని ఉగ్రదాడులు చేస్తామని ఐసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసిస్ ప్రకటించినట్టుగానే కొలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద డియో బైక్లో బాంబులు అమర్చి పేల్చివేశారు. అయితే పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పార్క్లో అనుమానాస్పదంగా చేసి పార్క్ చేసి ఉన్నప్పటికీ దానిని ఎవరూ గురించలేదు. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికన్ ఇంటలిజెన్స్ కూడా శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అమెరికన్ ఇంటలిజెన్స్ హెచ్చరించినట్టుగానే.. ఈరోజు ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది.