జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మి నారాయణ , వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్ హోరా హోరీగా సాగింది .. అయితే ఈ నేపథ్యంలో లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు .. తాను ముందు ఏ పార్టీలోకి కూడా చేరక ముందు అన్ని పార్టీల వారు సంప్రదించారని, అందులో భాగంగానే వైసీపీ వారు కూడా సంప్రదించి తనని వారి పార్టీలో చేరవలసిందిగా కోరారని తెలిపారు.అది ఎవరో కాదు తనతో అంత వాగ్వాదం చేసిన విజయసాయి రెడ్డే స్వయంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడారని తాము కూడా అన్ని పార్టీల్లానే ప్రజల కోసం కష్టపడుతున్నాము జగన్ కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు అందుకని తాను కూడా వారి పార్టీలో చేరాల్సిందిగా కోరారని జేడీ లక్ష్మీ నారాయణ అసలు విషయం బయటకు వెల్లడించారు.