కొలంబో: శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల వల్ల అనేక మంది నేలకొరిగారు. ఎన్నో వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొలంబోలో జరిగిన ఆత్మహుతి బాంబు దాడులకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొన్ని నిమిషాల ముందు బ్యాగు నిండా బాంబులతో ఉగ్రవాది చర్చిలోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. చర్చిలోకి వచ్చిన కొద్ది సేపటి తర్వాత సీసీ కెమెరా పనిచేయడం ఆగిపోయింది.వరుస బాంబు పేలుళ్లకు ఘటనలో ఇప్పటివరకు 321 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 45 మంది చిన్నారులు ఉండడం అత్యంత దారుణం. మరో 500 దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది.