ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి మరో నూతన ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఒప్పొ ఏ5ఎస్గా పిలువబడే ఈ ఫోన్ను ప్రధానంగా రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. 2 జీబీ ర్యామ్+32 జీబీ మెమరీ ఒక వేరియంట్. దీని ధర రూ.9,990. ఈ ఫోన్ను ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్స్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ మరొక వేరియంట్. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ మే నెలలో అందుబాటులోకి రానుంది. ఒప్పొ ఏ5ఎస్లో కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్లో డ్యూయెల్ రియర్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ), 8 ఎంపీ సెల్ఫీ కెమెరాలను అమర్చారు.
ఒప్పొ ఏ5ఎస్ ఫీచర్లు:
* 2 జీబీ ర్యామ్+32 జీబీ మెమరీ
* 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్,
* వాటర్డ్రాప్ డిస్ప్లే,
* మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్,
* స్మార్ట్ బార్,
* రియర్ కెమెరా (13 ఎంపీ+2 ఎంపీ),
* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా,
* మ్యూజిక్ ఆన్ డిస్ప్లే,
* స్మార్ట్ స్కాన్,
* ఆండ్రాయిడ్ ఓరియో,
* 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ