ఫిలిప్ఫీన్స్: ఫిలిప్ఫీన్స్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో దాదాపు 8 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బొడెగా పట్టణం కేంద్రంగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదు అయింది. ఇటు మనీలాలో భూప్రకంపనలు సంభవించాయి. మొత్తం 52 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. వరుసగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.