న్యూఢిల్లీ, ఆగస్ట్ 20: అనుకున్నట్టు గానే మన ప్రధాని మోదీ ప్రజల మన్ననను పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా కేబినెట్ మంత్రులందరికి పలు సూచనలు జారీ చేశారు. ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందని మంత్రులు ఫైవ్-స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారు ఇక నుండి దానికి దూరంగా ఉండాలంటూ ప్రధాని తెలిపారు. మంత్రులు వారి మంత్రిత్వ శాఖల ద్వారా పొందే లబ్దిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోరాదని, ఇది ఆయనను చాలా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. ప్రభుత్వ వాహనాలను కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం ఉపయోగించరాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే వ్యక్తిగత సిబ్బందిని కూడా తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవద్దని ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. భాజపా పాలనపై ప్రజలకు గురి కుదిరేందుకు మోదీ ఈ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.