ఉత్తరప్రదేశ్, ఆగస్ట్ 19: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ఖతౌలి దగ్గర ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సంఘటన స్థలంలోని స్థానికుల వివరాల ప్రకారం పూరి - హరిద్వార్ మధ్య నడిచే ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఆరు బోగీలు పట్టాల నుండి పక్కకు ఒరిగింది. చాలా మంది గాయపడ్డారు, మృతుల సంఖ్య తెలియాల్సి వుంది. సహాయక సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.