హైదరాబాద్, ఆగస్ట్ 19: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరో 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని తెలిపారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు. వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీలో సెలవులను అధికారులు రద్దు చేసి, ఈ రోజు, రేపు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు.