ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. మణిపురి దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మంది గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.