కొలంబో:శ్రీలంకలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 185 కు చేరగా 560 మందికి పైగా తీవ్రంగా క్షతగాత్రులు అయినట్టు సమాచారం. క్షతగాత్రులకు వైద్యం చేయడానికి రక్తం కొరత ఏర్పడినట్లు తెలుసుంది. ఈ నేపథ్యంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్లు ప్రజలను రక్తదానం చేయాల్సిందిగా కోరాయి. బట్టికాలోవాలోని ఆస్పత్రిలో అదేవిధంగా మీగమువ, నెగోంబో, త్రింకోమలె, నరెహెన్సింతియా కేంద్రాల్లోని బ్లడ్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్లో ప్రజలు రక్తం దానం చేయాల్సిందిగా విన్నవించారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు స్టార్ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ దాడిని ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద దాడిగా అంతర్జాతీయ మీడియా పరిగణిస్తుంది.