పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-04-20 16:31:29  peru , raod accident

లిమా: పెరూలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పియురా నుంచి లిమాకు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి జాతీయరహదారిపై ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో బస్సు పై భాగంలో కూర్చున్న ప్రయాణికులు రాళ్లపై పడి మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అమెరికన్ పాపులర్ రివెల్యూషనరీ అలియన్స్ పార్టీకి చెందిన బృందం బస్సులో ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియరాలేదు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పెరూ పోలీసులు వెల్లడించారు.