చివరి దశలో ‘సాహో’ షూటింగ్

SMTV Desk 2019-04-20 13:02:39  Saaho,

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకొంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ముంబైలోని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో టాకీ పార్ట్ కూడా పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టనున్నారు. తెలుగులో ఇప్పటి వరకు రానటువంటి హై స్టాండర్డ్స్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండనున్నాయి అనే విషయం సాహో మేకింగ్ వీడియోల ద్వారా స్పష్టం అయిపొయింది. బాహుబలి రేంజ్ లో సాహో సినిమాని విడుదల చేయనున్నారు. ఆ రేంజ్ హిట్ కూడా దక్కుతుందనే ధీమాతో చిత్రబృందం ఉంది.