ఆ ముగ్గురికి హైకోర్ట్ నోటీసులు

SMTV Desk 2019-04-19 15:44:14  High court, TDP,

ముగ్గురు టీడీపీతెలుగుదేశం పార్టీ నేతలకు నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం కేసులో.. నోటీసులివ్వాలని విజయవాడ సీపీని ఆదేశించింది హైకోర్టు. ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ నాగుల్ మీరాకు నోటీసులివ్వాలని సూచించింది. 2017లో ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై.. దురుసుగా ప్రవర్తించిన ఘటనలో హైకోర్టు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.