రోహిత్ శర్మ, అమిత్ మిష్రా అరుదైన రికార్డ్స్

SMTV Desk 2019-04-19 12:18:39  Rohit sharma, Amit mishra

గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌శర్మ ఈ మ్యాచులో 8000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ టీ20ల్లో 8వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడు రోహిత్‌శర్మ కావడం గమనార్హం. సురేశ్‌రైనా, కోహ్లీ గతంలో ఈ ఘనత సాధించారు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మిశ్రా కంటే ముందు ముంబయి ఇండియన్స్‌ బౌలర్‌ మలింగ ఈ ఘనత సాధించాడు. అయితే, మిశ్రా తీసిన 150వ వికెట్ రోహిత్‌దే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.