రేపు వైన్స్ బంద్

SMTV Desk 2019-04-19 12:11:36  wines

హైదరాబాద్: హైదరాబాద్ లో రేపు హునుమాన్ శోభాయాత్ర సందర్భంగా.. మద్యం షాపులను, బార్లను మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచీ శనివారం ఉదయం 6 గంటల వరకూ మూసేయాలని స్పష్టం చేసింది. యాత్ర రేపు హైదరాబాద్ ఉదయం గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు సాగనుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్ బండ్ వరకు కోలాహలం ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చాత్ర వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.