లక్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గంలో ఆమె ఈరోజు తన నామినేషన్ దాఖలు చేసింది. మేనకా గాంధీ బిజెపి తరుపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్లోని ఆజంఘడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి ఆజంఘడ్ కంచుకోటగా ఉంది. మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్ ఆజంఘడ్ను ఎంపిక చేసుకున్నారు.ములాయం మొయిన్పురి నుంచి బరిలో ఉన్నారు.