పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

SMTV Desk 2019-04-18 16:27:29  chattishgharh, raipur, danthewada, firings between polices and Maoists

రాయ్ పూర్: గురువారం ఉదయం దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ధనికర్కా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. . హతమైన మావోయిస్టులను వర్గీస్‌, లింగాగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని నుంచి మూడు తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఎదురుకాల్పుల్లో హతమైన వర్గీస్, లింగాలు దంతెవాడ బిజెపి ఎమ్మెల్యే భీమా మాండవీ, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.