స్టాండ్‌బైలుగా రిషబ్, రాయుడు, నవ్‌దీప్

SMTV Desk 2019-04-18 16:12:13  icc world cup 2019, rishab pant, ambati rayudu, navdeep saini, bcci

ముంబై: ఐసీసీ వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కని రిషబ్ పంత్, అంబటి రాయుడులను తాజాగా బిసిసిఐ స్టాండ్‌బైలుగా ప్రకటించింది. వీరితో పాటు యువ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ కూడా స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఎంపిక చేసిన 15 మంది క్రికెటర్లలో ఎవరైన గాయం వల్ల జట్టుకు దూరమైతే వీరిని టీమిండియాకు ఎంపిక చేస్తారు. సుదీర్ఘకాలం పాటు జరిగే ప్రపంచకప్‌లో ఆటగాళ్లు గాయపడడం సర్వసాధారణ అంశమే. ఈ పరిస్థితుల్లో రిషబ్, రాయుడులకు ప్రపంచకప్ అవకాశాలు ఇంకా మిగిలేవున్నాయని చెప్పాలి. ఇదిలావుండగా రాయుడును టీమిండియాకు ఎంపిక చేయక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు గంగూలీ, గవాస్కర్, గంభీర్, ఆకాశ్ చోప్రా, మంజ్రేకర్ తదితరులు జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, అన్ని వైపులు నుంచి విమర్శలు తలెత్తడంతో బిసిసిఐ దిద్దుబాటు చర్యలకు నడుంబిగించింది. ఇందులో భాగంగానే వీరిని స్టాండ్‌బైలుగా ఎంపిక చేసింది.