భువనేశ్వర్: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం ఒడిశాలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ లగేజిని సోదా చేశారు. ఆ సమయంలో రూర్ కెలాలో పర్యటిస్తున్న సిఎం నవీన్ పట్నాయక్ హెలిప్యాడ్ లో ఉండగానే ఈసి ప్లయింగ్ స్క్వాడ్ లగేజిని చెక్ చేశారు. రెండు రోజుల క్రితం కర్నాటక మాజీ సిఎం యడ్యూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను కూడా ఎన్నికల అధికారులు చెక్ చేశారు. కొన్ని రోజుల క్రితం కర్నాటక సిఎం కుమారస్వామి కాన్వాయ్ను కూడా తనిఖీ చేశారు.