యూపీ, ఆగస్ట్ 17 : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లింలను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు రోడ్లపైకి వచ్చి నమాజ్ చేయడం సరి కాద౦టూ సంచలన ప్రకటనలు చేసారు. కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను యూపీ పోలీస్ స్టేషన్లలో జరుపుకోవడం ఆపాలని తానూ కోరలేదన్నారు. ఇకపై ఈ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతామని ఇంతకు ముందున్న ప్రభుత్వం ఈ వేడుకలను సరిగ్గా నిర్వహించలేదని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రతి ఒక్కరు తమ వేడుకలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.