మోదీ మళ్ళీ ప్రధాని...నాకైతే నమ్మకం లేదు : నవీన్ పట్నాయక్

SMTV Desk 2019-04-16 15:57:26  narendramodi, naveen patnaik, odissa chief minister, indian prime minister

ఒడిశా: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ....ప్రధాని మోడీ మళ్లీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకు లేదన్నారు. అప్పటి ప్రధాని వాజ్ పేయ్ తో తాను పనిచేశానని గుర్తు చేసుకున్నారు. మోడీ చెప్పింది ఏదీ చేయలేదని, యువతకు ఉపాధి కల్పించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంకా పరిపక్వత రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మోజార్జీ రాని పక్షంలో ఒడిశాను ఆదుకునే వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన బిజెపికి సవాలు విసిరారు. రాష్ట్రానికి సిఎం అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బిజెపి తమ అభ్యర్తిని ప్రకటించేందుకు భయపడుతుందన్నారు. బిజెపి నేతలు చెప్పే డబుల్‌ ఇంజన నినాదం ఒడిశాలో ఫెయిల్‌ అయ్యిందన్నారు పట్నాయక్‌.