ఆదిత్యనాథ్, మాయావతిలకు ఈసీ నోటీసులు

SMTV Desk 2019-04-16 15:48:36  Yogi adhithyanag, Uttarpradesh CM, BJP,mayawati, bsp party, loksabha elections

న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతిలపై ఎలక్షన్ కమిటీ వేటు వేసింది. వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో మతపరమైన విమర్శలు చేస్తున్నారని వీరిపై ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. వీరిరువురు ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటల తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం యోగి 3 రోజులు, మాయావతి 2 రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి.