కడప: కడపలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లింగాల మండలం దొండ్లవాగు సమీపంలోని దేవిరెడ్డి సంజీవరెడ్డి గోదాములో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాములో నిల్వచేసిన శనగ, ధనియాలు, జొన్నలు దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకు పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యుతాఘాతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కడప నగరంలోని దేవుని కడపలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.20లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.