ఢిల్లీ హైకోర‍్టులో బాంబు ఉందంటూ ఫోన్‌ కాల్

SMTV Desk 2017-08-17 13:19:32  Delhi High court, Bomb , police,

న్యూ ఢిల్లీ, ఆగస్ట్ 17: దేశ రాజధాని ఢిల్లీ లో అలజడి, బాంబు పేళుల్ల హెచ్చరికతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఢిల్లీ. ఢిల్లీ హైకోర‍్టులో బాంబు ఉందంటూ ఫోన్‌ కాల్ రావటంతో అప్రమత్తమైన రాజధాని పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులతోపాటు, బాంబ్ స్క్వాడ్‌ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ సందర్భంగా జడ్జిలతోసహా కోర్టులో ఉన్నవారందరినీ బయటికి పంపించారు పోలీసులు. ఆ ఫోన్‌ కాల్‌ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతం నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. భజన్‌పురాలోని ఓ పీసీఆర్‌ నుంచి ఫోన్‌ చేసిన ఆగంతకుడిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.