సెప్టెంబర్ 2 తర్వాతే యూరప్ లో PSPK@25 టీం

SMTV Desk 2017-08-17 12:35:16  PAWAN KALYAN, TRIVIKRAM SRINIVAS, KEERTHY SURESH, EUROPE COUNTRY.

హైదరాబాద్, ఆగస్ట్ 17 : హారికా మరియు హాసినీ క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నచిత్రంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ మరియు అను ఇమ్మాన్యూల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఆ తరువాత షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉండగా వచ్చేనెల 2వ తేదీన పవర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే వేడుకలు ముగిసిన తరువాతనే యూరప్ వెళ్ళే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ఇదే మేజర్ షూటింగ్ కావడంతో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను కూడా చిత్రీకరించనున్నారు. దీంతో దాదాపుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ కారణంగా ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుకున్నారు.