ముంబై, ఆగస్ట్ 17 : మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్కు మద్రాస్ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2008లో నిబంధనలకు విరుద్దంగా విలాసవంతమైన కారును చెన్నై పోర్టు నుంచి తెప్పించుకున్నారన్న కారణంతో ఆమెకు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ సుందరిపై ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేసి పలుమార్లు విచారణకు ఆదేశించిన ఆమె హాజరు కాలేదు. దీంతో జూన్లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 18లోగా విచారణకు హాజరుకావాల౦టూ కోర్టు నోటీసును జారీ చేసింది.