లక్నో: బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ హేమామాలిని లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్న హేమామాలిని.. అభివృద్ధికై కృషి చేశానన్నారు. ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళలు కూడా మద్ధతు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.