సోమవారం ఇండియన్ మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర ఈ రోజు కాస్త దిగొచ్చింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం వల్ల పది గ్రాముల బంగారం ధర రూ.235 తగ్గుదలతో రూ.32,980కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.660 క్షీణతతో రూ.38,010కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.235 తగ్గుదలతో రూ.32,980కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.235 తగ్గుదలతో రూ.32,810కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.660 తగ్గుదలతో రూ.38,010కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ రూ.77 పెరుగుదలతో రూ.37,830కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000కు, అమ్మకం ధర రూ.80,000కు తగ్గింది. హైదరాబాద్లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,090కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,560కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.41,000కు చేరింది.