దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న 1665 మినిస్టీరియల్, ఐసోలేటెట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్ఆర్బీ ఇప్పుడు ఆ దరఖాస్తు గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 8న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7తోనే ముగియనుంది. అయితే ఈ గడువును 15 రోజుల పాటు అంటే ఏప్రిల్ 22 వరకూ పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ జాబ్స్కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులకు 50శాతం మినహాయింపు ఉంటుంది.